ట్రాన్స్ఫార్మర్ దగ్గర విద్యుత్ షాక్ గురై మూడు గేదెలు మృతి

మల్దకల్ అక్టోబర్ 21(జనంసాక్షి)మల్దకల్ మండల కేంద్రానికి చెందిన నిమ్మకాయల మునెప్పకు చెందిన మూడు గేదలు కరెంటు షాక్ తో మృతి చెందాయి…. శుక్రవారం మల్దకల్  వేదపాఠశాల వెనక ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర మూడు గేదలుమేతకోసం వెళ్లి మృత్యువాత పడ్డాయి.వీటి విలువ 2 లక్షల 50 వేల విలువ ఉంటుందని బాధితుడు తెలిపాడు.ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధితుడు తెలిపారు.విద్యుత్ అధికారులు అక్కడ ఉన్న  ట్రాన్స్ఫారంను వేరే చోటికి తరలించి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులపై ఉంది.ప్రతి విద్యుత్ ట్రాన్స్ఫారం వద్ద కంచె ఏర్పాటు చేసి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందన్నారు.చాలా గ్రామాలలో విద్యుత్ ట్రాన్స్ఫారం వద్ద కంచలేకుండానే విద్యుత్ ట్రాన్స్ఫారంలు ఉన్నాయని ఆ గ్రామాల రైతులు ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెంటనే బాధితుని ఆదుకొని ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.