డాక్టర్ జైపాల్ రెడ్డి ధర్మపురి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు..

డాక్టర్ జైపాల్ రెడ్డి ధర్మపురి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు

ధర్మపురి ( జనం సాక్షి) పట్టణ కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రం ధర్మపురి లో డాక్టర్ జైపాల్ రెడ్డి ప్రోగ్రాం ఆఫీసర్ మాత శిశు సంరక్షణ జగిత్యాల సందర్శించి ధర్మపురి ఆసుపత్రిలో ప్రసవాలు కొరకై డాక్టర్ శిరీష గైనకాలజిస్ట్ సేవలు ధర్మపురి సామాజిక ఆరోగ్య కేంద్రం లో వినియోగించుకోవాలని కోరారు సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేసి అందరూ గర్భిణీ స్త్రీలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ధర్మపురికి ప్రసావాలకు వచ్చే విధంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేశారు అలాగే కెసిఆర్ న్యూట్రిషన్ కిట్టు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డా. నవీన్ ధర్మపురి హాస్పిటల్ సూపర్నెంట్ డా. శిరీష గైనకాలజిస్ట్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఏ. రాజేశం, పి.సతీష్ కుమార్, సూపర్వైజర్లు వెంకటేష్, అనిత కుమారి, శాంతి జయసుధ స్టాఫ్ నర్స్, మరియు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.