డిఎస్పి రఘు 12 ఆటోలు 30 ద్విచక్రవాహన పాత్రలను పరిశీలించి సరైన ధ్రువ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పొలిస్ స్టేషన్ కి తరలించారు.

రాయికోడ్ అక్టోబర్18 జనం సాక్షి రాయికోడ్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు* సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని బుడగజంగల కాలనిలో తెల్లవారుజామున 5 గంటల నుండి 07 గంటల వరకు జహీరాబాద్ రూరల్ సిఐ భారత్ కుమార్, స్థానిక ఎస్సై ఏడుకొండలు ఆధ్వర్యంలో సిబ్బంది తో కలిసి ఆకస్మికంగా మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ డిఎస్పి రఘు 12 ఆటోలు 30 ద్విచక్రవాహన పాత్రలను పరిశీలించి సరైన ధ్రువ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పొలిస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు చూపిస్తే తమ వాహనాలు తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని డిఎస్పి తెలిపారు. ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకున్నట్లయితే అట్టి విషయాన్ని పోలీసులకు సమాచారం తెలుపాలని అన్నారు. అలాగే చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే రోడ్డు ప్రమాదలపై మరియు సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ రూరల్ సీఐ భారత్ కుమార్, రాయికోడ్ ఎస్సై ఏడుకొండలు, ఝారసంగం రెండవ ఎస్సై అబ్దుల్ సమద్, హాద్నూర్ ఎస్సై విజయ్ కుమార్ మూడు పోలీస్ స్టేషన్ ల ఏఎస్సై లు, పోలీసు సిబ్బంది ప్రజలు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.