డివైడర్ పనులను పరిశీలించిన మునిసిపల్ కమిషనర్

అయిజ,జులై 06 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం మెయిన్ రోడ్డు డివైడర్ పనులను మునిసిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య  పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్  మెయిన్ రోడ్డు అయ్యప్ప స్వామి దేవాలయం నుండి రాయచూరు రోడ్డు చౌరస్తా వరకు డివైడర్ పనులలో భాగంగా మొదట  ఒకఫీట్ ఎత్తు ఉండేలా కాంక్రీటు తో గోడలు నిర్మించి తర్వాత రెండు ఫీట్ల ఎత్తుతో రాతి గోడలు నిర్మించి డివైడర్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఈ డివైడర్ మధ్య భాగంలో అందమైన మొక్కలు నాటుతామని, బటర్ ఫ్లై హైమాస్ట్ లైట్లు ఏర్పాటుతో రోడ్డు బహుసుందరంగా కనిపించేలా నిర్మాణం ఉంటుందని తెలిపారు.
ఆదర్శ స్కూలు జోగులాంబ టివి ఆఫీస్ దగ్గర యూటర్న్ కు అవకాశం కల్పించాలని కొందరు కాలనీ వాసులు కమిషనర్ కి విన్నవించగా సాధ్యాసాధ్యాలు పరిశీలించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడెక్కడ యూటర్న్ లు పెట్టాలో  నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ రాజేష్ , కౌన్సిలర్ చాకలి నర్సింహులు , కాంట్రాక్టర్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.