డీఎంకే ఆందోళన… రాజ్యసభ వాయిదా

న్యూఢిల్లీ : శ్రీలంక తమిళల అంశంపై రాజ్యసభలో డీఎంకే సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే ఆ పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. శ్రీలంకకు వ్యతిరేకంగా భారత్‌ తీర్మానం చేయాలని సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.