డీకే రవి మృతిపై సీబీఐ విచారణ

vci1d53nఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ విచారణకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ముందుగా సీబీఐ విచారణకు ససేమిరా అన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యా ఎట్టకేలకు దిగివచ్చారు. డీకే రవి కేసును తమ ప్రభుత్వమే హ్యాండిల్ చేస్తుందన్న ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో వెనక్కు తగ్గారు. అటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా సీబీఐ విచారణకు అంగీకరించాలని సిద్ధరామయ్యకు సూచించారు. దీంతో ఆయన సీబీఐ విచారణకు అంగీకరిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీబీఐ.. డీకే రవి మృతి కేసులో దర్యాప్తు చేపట్టనుంది.