డీజీపీని కలవనున్న ఎమ్మెల్యేల బృందం

హైదరాబాద్‌ : ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెరాస, భాజపా, సీపీఐ ఎమ్మెల్యేల బృందం డీజీపీ దినేశ్‌రెడ్డితో భేటీ కానుంది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి విషయమై వారు డీజీపీతో చర్చించనున్నట్లు సమాచారం.