డ్రగ్స్ ఇచ్చి.. విద్యార్థినిపై అత్యాచారం

jyoన్యూఢిల్లీ : ఫరీదాబాద్ లో ఓ మహిళపై జరిగిన అత్యాచారం ఘటనలో నిందితుడైన ఓ యువకుడితో పాటు దానికి సహకరించిన యువకుడి సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫరీదాబాద్ నగరానికి చెందిన ఓ యువతి సల్మాన్ అనే యువకుడి సోదరిని కలిసేందుకు వచ్చింది. ఇంటికి వచ్చిన యువతికి సల్మాన్ సోదరి మత్తు మందు కలిపిన టీ ఇచ్చింది. టీ తాగిన యువతి అపస్మారక స్థితిలోకి చేరడంతో ఆమెపై సల్మాన్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. రేప్ చేసిన మరునాడు సల్మాన్ తన బంధువులు, స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం సల్మాన్ యువతితో ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులు వారిని బయటకు తరిమేశారు. దీంతో అద్దె గదిలో సల్మాన్ యువతితో కొంతకాలం కాపురం చేశాక, ఆమెను ఒంటరిగా వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. దీంతో మత్తు మందు ఇచ్చి అత్యాచారం జరిపి, ఆపై ఉత్తుత్తి పెళ్లి చేసుకొని వాడుకొని వదిలివేసిన సల్మాన్ పై, దీనికి సహకరించిన సోదరిపై  బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫరీదాబాద్ పోలీసులు సోదరి, సోదరులపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.