ఢిల్లీలో క్యాబ్‌ డ్రైవర్ల ఆందోళన

2

– పోలీసుల లాఠీచార్జి

న్యూఢిల్లీ,మే2(జనంసాక్షి): దేశరాజధాని దిల్లీ నగరంలో డీజిల్‌ క్యాబ్స్‌ నిషేధంపై ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. డీజిల్‌ టాక్సీలను  నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ క్యాబ్‌ డ్రైవర్లు సోమవారం  ఆందోళన బాటపట్టారు. దీంతో దిల్లీ పశ్చిమ ప్రాంతంలోని రాజోక్రి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎక్కడిక్కడ ఆందోలనేకు దిగడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో దౌలాకువాన్‌ నుంచి గుడ్‌గావ్‌ వెళ్లే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులు గుడ్‌గావ్‌-దౌలాకువాన్‌ రోడ్డుపై పాత దిల్లీ టోల్‌ బూత్‌ వద్ద రహదారులు దిగ్బంధించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. రోడ్లపై దాదాపు కిలోవిూటరు మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఢిల్లీలో కాలుష్యనియంత్రణ కోసం డీజిల్‌ వాహనాలను నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వాహనాలను డీజిల్‌ నుంచి సీఎన్‌జీకి మార్చుకోవడానికి ఇంకా సమయం కావాలని పెట్టుకున్న పిటిషన్‌ను శనివారం సుప్రీంకోర్టు కొట్టేసింది. దిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో మే 1వ తేదీ నుంచి డీజిల్‌తో నడిచే క్యాబ్స్‌ను నిషేధిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు డీజిల్‌ క్యాబ్స్‌కు సీఎన్‌జీకి మారడానికి ఇచ్చిన గడువును రెండు సార్లు పొడిగించారు.