ఢిల్లీలో గవర్నర్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో మకాం వేశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొదుతున్న తమ సమీపబంధువును పరామర్శించడానికే ఆయన ఢిల్లీకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 24వ తేదీతో రాష్ట్రపతి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో గవర్నర్‌ మర్యాద పూర్వకంగా కలవాలనుకుంటున్న అధికార వర్గాలు తెలిపాయి. వీలైతే హోంమంత్రి చిదంబరంను కలవనున్నట్లు తెలిపాయి.