ఢిల్లీ చేరుకున్న మంత్రి కేటీఆర్

1న్యూఢిల్లీ: మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఢిల్లీ చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన పలువురు ఢిల్లీ పెద్దలను కలువనున్నారు. మొన్నటి వర్షాల కారణంగా రాష్ట్రంలో సంభవించిన పంట, ఆస్తి నష్టం, తదితర అంశాలపై కేంద్ర మంత్రులకు వివరించనున్నారు. రాష్ర్టానికి ఆర్థికసాయం అందజేయాల్సిందిగా కోరనున్నారు.