ఢిల్లీ చేరుకున్న సీఎం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. నామినేషన్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతి సాధించేందుకు సీఎం అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. ఈపర్యటనలో సీఎం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నేతలు గులాంనబీ ఆజాద్‌,అహ్మద్‌పటేల్‌, వయలార్‌ రవి తదితరులతో భేటీ కానున్నారు.