తడబడుతున్న ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ : ఫిరోజ్‌ షా కోట్ల మైదానం వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి తడబడుతోంది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే ఓపెనర్‌ వార్నర్‌ (0) ఇషాంత్‌శర్మ పెవిలియన్‌కు పంపి భారత్‌కు శుభారంభం అందించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హ్యూెజ్‌తో కలిసి మరో ఓపెనర్‌ కొవాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని ఇషాంత్‌శర్మ విడగొట్టాడు. దీంతో 71 పరుగుల వద్ద హోజ్‌ (45) రూపంలో ఆసీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అక్కడి నుంచి భారత్‌ స్పిన్నర్లు అశ్విన్‌ (2 వికెట్లు), రవీంద్ర జడేజా (1 వికెట్‌) విజృంభించడంతో 117 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఆసీస్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.