తప్పెట సాంబయ్య మృతదేహంపై పూలమాలవేసి నివాళి అర్పించిన మాల మహానాడు వరంగల్ జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగరావు

జనం సాక్షి, చెన్నారావుపేట

మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన మాల మహానాడు మండల నాయకుడు తప్పెట రాజేందర్ తండ్రి తప్పెట సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందగా, విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగరావు ఆధ్వర్యంలో లింగాపురం గ్రామానికి వెళ్లి మాలమహానాడు వరంగల్ జిల్లా కమిటీ నాయకులతో, స్థానిక నాయకులతో కలిసి సాంబయ్య మృతదేహంపై పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చడం జరిగింది.పూలమాల వేసిన వారిలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కోతి విష్ణు, జిల్లా కార్యదర్శి కునమల్ల కమలాకర్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు కడగండ్ల యాకయ్య, నాయకులు పల్నాటి జనార్ధన్, తప్పిట వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.