తహశీల్దార్ కు వినతి పత్రం

బషీరాబాద్ జులై 29,(జనం సాక్షి)బషీరాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు              కే.శ్రీనివాస్  తహశీల్దార్  కార్యాలయం ముందు ధర్నా చేసి తహశీల్దార్ ఎన్. వెంకట్ స్వామి కీ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో   సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నత పదవులలో  మహిళ ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ కరువైందని చెప్పారు.  మహిళలపై దౌర్జన్యం చేసిన వారిపై  చర్య తీసుకోవాలని అదేవిధంగా భోజ నాయక్ తండలో శివరాం వారి కుటుంబ సభ్యులు  గోరభి అనే  మహిళ పైన  దౌర్జన్యంగా దాడిచేసి పొలంలో రానీయకుండా అడ్డుకొని నానా బూతులు తిట్టిన వ్యక్తుల పై చట్ట పరమైన చర్యలు   తీసుకోవలని  ఆవేదన వ్యక్తం చేశారు.  ఇదేవిధంగా నిర్లక్ష్యం చేస్తే మానవ హక్కుల కమిషన్ వరకు వెళ్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో బాధితులు శారద, గోరభి,ప్రజా సంఘాల నాయకులు గోర్ బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు ప్రకాష్, సిపిఎం నాయకులు మహేష్, కెవిపిఎస్ నాయకులు సతీష్,మోహన్, జగదీష్,
రవి,బాలకృష్ణ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
Attachments area