తహసిల్దార్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు నిరసన

తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘంపిలుపుమేరకు న్యాయమైన హక్కుల సాధనకై నిరసన చేపట్టారు డిమాండ్ కోసం మల్దకల్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు సోమవారంమండలరేషన్ డీలర్లు ధర్నాచేపట్టారు. ఈ సందర్భంగా మండల రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు మాట్లాడుతూ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, క్వింటాలుకు 440కమిషన్ పెంచాలని వారు డిమాండ్ చేశారు.న్యాయమైన హక్కులు  సాధన కోసం నిరసన  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు తిప్పన్న నాయుడు,మల్లికార్జున్,గోపాల్ రెడ్డి, సుధాకర్, రంగమ్మ ,ఈశ్వరమ్మ, వినోదాచారి,శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.