తాండూర్ హిందు ఉత్సవ సమితికి రూ. 34 వేలు.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు అగస్టు 26(జనంసాక్షి)తాండూర్ హిందు ఉత్సవ సమితికి  మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ 34వేలరూపాయల చందాను ఉత్సవసమితి సభ్యులకుఅందజేశారు .రాబోయే వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకోని 34 వేల రూపాయలు హిందు ఉత్సవ సభ్యులకు చందా రాసారు. ప్రతిసంవత్సరం తాండూర్ పట్టణంలో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హిందు ఉత్సవ సమిత సభ్యులు  అడిగిన వెంటనే రూ.34 వేల చందాను సమితి సభ్యుల కు అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.హిందూ సంప్రదాయం ప్రకారం మొదటి పూజ వినాయకునికే నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవసమితి ప్రదాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింములు ,మున్సిపల్ కౌన్సిలర్ మణపూరం రాము ,కోషాదికారి పాండు ,సభ్యులు నర్సింలు ,బోయినిఆశోక్ తదితరులు ఉన్నారు.