తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న రాయచూర్ జిల్లా జడ్జి

మల్దకల్ అక్టోబర్ 23వ (జనంసాక్షి)మల్దకల్  శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం రాయచూరు జిల్లా సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జ్ సురేష్ వగ్గనవర్ దర్శించుకున్నారు. వారికి పట్వారీ అరవిందరావు స్వాగతం పలికారు.
ఆలయ విశిష్టతను వివరించారు
ఆలయ అర్చకులు మధుసూదనాచారి,వాల్మీకి పూజారులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి పట్వారీ అరవిందరావు శేష వస్త్రంతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు,చంద్రశేఖర్ రెడ్డి, శ్రీను,మనోహర్, తదితరులు పాల్గొన్నారు.