తిరుపతి స్విమ్స్‌లో మహిళపై అత్యాచారయత్నం

తిరుపతి: తిరుపతి స్విమ్స్‌లో దారుణం జరిగింది. మహిళా రోగిపై ఈసీజీ టెక్నిషియన్‌ అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించాడు. ఈసీజీ కోసం వెళ్లిన మహిళపై టెక్నిషియన్ మునికుమార్‌ అత్యాచారయత్నం చేయబోయాడు. ఘటనతో అప్రమత్తమైన మహిళ నిందితుడి నుంచి తప్పించుకొని ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మునికుమార్‌ను విధుల నుంచి తప్పించి శాఖాపరమైన విచారణకు ఆదేశించిన ట్లు అధికారులు తెలిపారు.