తిరుమల కాలనీలో డ్రైనేజ్ పై స్లాబ్ వేయించిన కౌన్సిలర్ కంచ రవి

వనపర్తి పట్టణంలో తిరుమల కాలనీలో   మహమ్మద్ మరియు కాజా  ఇంటిదగ్గర డ్రైనేజీ ఉన్నా  స్లాబ్ లేకపోవడంతో అక్కడి ప్రజలకు నడవడానికి చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ వార్డు ప్రజలు సమస్యను కౌన్సిలర్ కంచ రవి దృష్టికి తీసుకపోగా, వెంటనే స్పందిస్తూ, అట్టి డ్రైనేజీ పనులను ప్రారంభిస్తూ, ఈరోజు డ్రైనేజ్ మీద స్లాబ్ వేయించడం జరిగింది.ఈ వార్డు  ప్రజలు సంతోష వ్యక్తపరుస్తూ, కౌన్సిలర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ కంచరవి, మరియు AE హేమలత, కాంట్రాక్టు సింగొటం నాయుడు, వార్డు ప్రజలు, తదితరులున్నారు.