తీన్మార్ మల్లన్న నోరు జాగ్రత్తగా పెట్టుకో : టీఆర్ఎస్

చేర్యాల (జనంసాక్షి) జులై 29 : పూటకో పార్టీ మార్చే తీన్మార్ మల్లన్న నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని విమర్శించే స్థాయి కాదని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో రెండు పర్యాయాలు నడిపిస్తున్న ఘనత ముత్తిరెడ్డికే దక్కుతుందన్నారు. వార్డు మెంబర్ గెలవని వ్యక్తివి ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి నీకు లేదని హితవు పలికారు. ఈ జనగామ ప్రాంతంలో ఎక్కడ కనబడినా కోడిగుడ్లతో స్వాగతం పలుకుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల తెరాస సోషల్ మీడియా మండల పార్టీ కన్వీనర్ తాటికొండ సదానందం, కొమురవెల్లి ఆలయ మాజీ ధర్మకర్త వజ్రోజు శంకరాచారి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అంబాల శ్రీనివాస్ గౌడ్, బొట్టు శంకర్, కామేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.