తెరాసలోకి పలువురి చేరిక.

కోటగిరి ఆగస్టు 18 జనం సాక్షి:-కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన వివిధ పార్టీల పలువురు నేతలు గురువారం రోజున బాన్సువాడ నియోజక వర్గ తెరాస పార్టీ ఇంచార్జీ పోచారం సురేందర్ రెడ్డి సమక్షంలో టి.అర్.ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా వారికి పోచారం సురేందర్ రెడ్డి గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కెసిఆర్,స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సహకారంతో నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ముగ్ధులై పలువురు నేతలు పార్టీలోకి చేరడం సంతోషకర మైన విషయం అని పేర్కొన్నారు.ప్రజా సమస్యలకై స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి చేస్తున్న కృషికి ముగ్ధులై వివిధ పార్టీల నేతలు తెరాసలోకి చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు.అనంతరం గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన శాధిముభారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ చేరికలో స్థానిక సర్పంచ్ సాయిబాబా,మండల తెరాస పార్టీ అధ్యక్షులు ఎజాస్ ఖాన్, ఎత్తోండ ఎంపీటీసీలు అగ్గు కల్పన హన్మంతు,ఫారుక్,ఎత్తోండ పి.ఎ.సి.ఎస్ ఛైర్మెన్ అశోక్ పటేల్,మండల కో ఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్,రఫీ,గ్రామ తెరాస పార్టీ అద్యక్షులు శ్రీనివాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్,కిషోర్ పటేల్,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు