తెరాస నాయకుల ఆధ్వర్యంలో నులిపురుగుల మాత్రల పంపిణీ.

 

ఫోటో.. అంగన్వాడీ పిల్లలకు నులీపురుగు మాత్రలు పంపిణీ చేస్తన్న దృశ్యం…

రుద్రూర్ (జనంసాక్షి) :- రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్ సీ కాలనీలో గల ప్రైమరీ పాఠశాలలో గురువారం చిన్నారులకు నులి పురుగు మాత్రలను జడ్పిటిసి నారోజీ గంగారాం, ప్రాథమిక ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ దిలీప్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చిన్నారులకు ఎలాంటి వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తగా నులి పురుగుల మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో , తహసీల్దార్ ముజీబ్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షులు తోట్ల గంగారాం, తెరాస పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.