తెలంగాణతోనే సమస్యల పరిష్కారం

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

కలెక్టరేట్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. ఆదివారం హన్మకొండలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన అధ్యాపక గర్జనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీ లెక్చరర్స్‌ ఫోరం అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తోందని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి తెలంగాణ సాధనకు కృషి చేయాలని కోరారు. ఎవరూ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.