తెలంగాణలోని పలు వర్సిటీలకు వీసీల నియామకం

1

హైదరాబాద్‌,ఏప్రిల్‌18(జనంసాక్షి): రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన వర్సిటీ వీసీగా వీరారెడ్డి, కాకతీయ యూనివర్సిటీకి టి.చిరంజీవులు, మహాత్మాగాంధీ వర్సిటీకి ఎ.వాణీప్రసాద్‌, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి -ఏలూరు శివారెడ్డి నియమితులయ్యారు. తెలుగు యూనివర్సిటీ విసిగా ఇప్పటికే వ్యవహరించిన ఎల్లూరు శివారెడ్డి  మరోసారి నియమితులయ్యారు. ఆయనను మరోమారు విసిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఖాళీగా ఉన్న పలు యూనివర్సిటీలకు విసిల నియామకం జరిగినా, మరికొన్ని యూనివ్సిటీలకు ఇంకా విసిలను నియమించాల్సి ఉంది.