“‘తెలంగాణలో కొత్త ప్రభుత్వం వత్తం(ది)దా””?

“‘తెలంగాణలో కొత్త ప్రభుత్వం వత్తం(ది)దా”?   సిద్దిపేట కొత్త బస్టాండ్ లో హుస్నాబాద్, హన్మకొండ పల్లెవెలుగు బస్సెక్కాను. పాత బస్టాండ్
 నుండే పబ్లిక్ ఫుల్ గా  ఎక్కి నిలబడ్డారు.చుట్టపు చూపుగానే కొత్త బస్టాండ్ కు వచ్చి గడియసేపు అగకుండానే బస్సు కదిలింది.బస్సులో నిలబడే స్థలమైతే దొరికింది.హైదరాబాద్ కు  పోయే రోడ్డు మీద నుండి హుస్నాబాద్ రోడ్డుకు బస్సు మలిగింది.బస్సు పోయే రోడ్డు పక్క డివైడర్ అవతలి రోడ్డు నుండి ఎన్నికల పార్టీ ఊరేగింపు వస్తుంది.బస్సులో ఉన్న జనంలో కొంత మంది ఏ పార్టని ఆసక్తిగా చూస్తుంటే కొంత మంది మాములేనన్నట్లుగా ఉన్నారు.బస్సు టాప్ సపోర్ట్ పైప్ ను పట్టుకొని నిలబడ్డ అవ్వ తన అభిప్రాయాన్ని చెప్పసాగింది.ఎలక్షన్ లేమోగాని మంత్రి ఎంబడి తిరిగేటోళ్లకైతే పట్ట పగ్గాలు లేవు.రోజు తాగి తలకుపోసుకుంటున్నారు.పక్కపొంటి నిలబడ్డ ముసలవ్వ జోక్యం చేసుకుని అదేందవ్వ! తులమో,ఫలమో అందరికి అందుతున్నాయి గదా ? అని మాట కలిపింది.సీటు మీద కూర్చున్న పెద్ద మనిషి మాటల మధ్యలో దూరి అందరికి ఇయ్యాలంటే  ఏ నాయకుడి తరం కాదు.కాకపోతే మనిషికి రెండు వందలు ఇచ్చి జనాన్ని మీటింగ్ లకు తీసుకపోతున్నారు.రోజు ప్రచారానికి తిరిగెటోళ్లకు తొవ్వ ఖర్చులు,తిండి,రాత్రిపూట ఇంత మద్యం తాగి త్తార్రు.ఓట్లు రేపనగా అయిందొలో వెయ్యో ఇస్తరు.
మండ్ల అయిదేండ్లు వాల్ల ముడ్డి చుట్టూ తిప్పుకుంటారు.నువ్వు ఎన్నైనా చెప్పయ్య ! ఎలక్షన్లు వచ్చినయంటే తీర్థం లెక్క సాగుతంది.నేను పుట్టి డెబ్బయి ఏండ్లు అవుతంది. దిన దినం డబ్బులు పంచుడు,మందు తాగించుడు ఎక్కవైతంది.నాకు కొత్తగా ఓటచ్చినప్పుడు మా రామయ్య మామ గీగుర్తుకు ఓటెయ్యమంటే అడకట్టోల్లమంత ఏసినం.
కాని ఇప్పుడు ఇంటింటికి లీడర్లు అయిర్రు. పాయిదా ఏమచ్చిందిరా అంటే నీళ్లల్ల ఏలు పెట్టి నోట్లో ఏలు పెట్టుకున్న శాత్రం అయింది.ఈ సర్కారు వలన జనం అరిగోస పడుతుర్రు.మా మామ  సంపాదించి ఇచ్చిన భూమిలో మేమే కాస్తు చేసుకుంటున్నాము.మా ఆయన పేరు మీద పట్టా బుక్ ల ఉండoగ కూడా ఎవడో ముండ కొడుకు ధరణిలో ఎక్కిచ్చిడoట,
మా మనుమడు కాగితాలు పట్టుకొని తాసీల్ ఆఫీస్,ఆర్డీఓ ఆఫీస్,కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా గాని అందరూ మేము ఏమి చేయలేమని చేతులెత్తిర్రట.మoడ్ల ధరణి నుండి తీసేసి మా ఆయన పేరు మీద పట్టా కావాలంటే కోర్టులో తప్స చేసుకోవాలంట.ఇప్పటికే మా మరిది కొడుకు ఒక కేసులో పదేండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుచున్న ఇంకా తీర్పు రాలేదట.ఇగ ఎలక్షన్లు వచ్చినయి గదా ? కొత్త ప్రభుత్వం వస్తే చేస్తామని అంటున్నారని ఆగినం.ముసలామె మాటలను గమనించిన రిటైర్డ్ ఉద్యోగి మెచ్చుకోలుగా నీవు చెప్పింది నిజమే అన్నాడు.అలాగే ధరణి వలన రైతులు చాల ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చాడు.పొలం పనులతో సతమతమయ్యే రైతులను ఆఫీస్ ల చుట్టు తిప్పి పరేషాన్ చేసిండు. డబ్బులు ఖర్చు పెట్టించిండు.కనీసం పాత పట్టాదారు పాస్ బుక్ లలో ఉన్న భూములనన్న ధరణిలో సక్రమంగా ఎక్కించలేదు.ధరణిలో జరిగిన తప్పులను సరిదిద్దే ఫవర్స్ ను ఎమ్మార్వో ,ఆర్డీఓ, కలెక్టర్ల నుండి తీసేసాడు.ధరణిలో జరిగిన తప్పులను కోర్టులో పరిష్కరించుకోవాలంటే మాటలా? వకీలును పెట్టుకోవాలి,కోర్ట్ చుట్టూ ఏండ్లకు, ఏండ్లు తిరగాలని
చెప్పాడు.
బస్సు ఎత్తేసుకుంట పరుగెడుతుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన పదేండ్ల కు సిద్దిపేట నుండి హుస్నాబాద్ కు కొత్తగా డబుల్ రోడ్డు పోస్తున్నారు.అందుకే బస్సు ఎత్తేసుకుంటూ ప్రయాణిస్తుంది.పాత కరీంనగర్ జిల్లా బస్వాపూర్ కు వచ్చినంక సీటు దొరికింది.నా ప్రక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు.ముందు సీట్లో ఇద్దరు వ్యవసాయ  సంబంధమైన నడీడు పైబడిన మహిళలు కూర్చున్నారు.వాల్లు ఇద్దరు పరిచయస్తులైనప్పటికీ కూడా ఎలక్షన్ల గురించే మాట్లాడుకుంటున్నారు.నా మనమడు మూడు సార్లు పరీక్ష రాస్తే రెండు సార్లు పేపర్ లీకైందన్నారు.మరోసారి ఒక్క మార్కులో పోయిండట,మొన్న పోలీస్ నౌకరి వచ్చిందని అన్నాడు.కాని కోర్టులో కేసు పడి పెండింగులో పెట్టిoడ్ర ట,పొరగాండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఒక్కడికి ఉద్యోగం రాకపాయే.మనోళ్లకు ఉద్యోగాలు రాకపోతేoదక్క వాల్ల కుటుంబాల్లో ఎవరూ ఖాళీ లేరుగదా! అయ్యతో పాటుగా కొడుకు,బిడ్డ,మేనల్లుడు,సడ్డకుడి కొడుకు కూడా పెద్ద పెద్ద పదవులలో కూర్చుండిరి.ఇక ఎవరెక్కడ పొతే వాళ్లకెంది.జనమే ఇబ్బంది పడుతున్నారు.గట్లెందుకు అంటవే ! కొంత మంది జనం కూడా బాగుపడ్డారు.చింతమడుకల యాదవ్వ కొడుకుకు ఇల్లు కట్టిoచిర్రు,పది లక్షల లోన్ ఇచ్చిర్రు. నువ్వానేది నిజమే అక్కా!ఒక్క చింతమడుకొల్లే ఓట్లేస్తే ప్రభుత్వం రాలేదు గదా ? దేశమంతా ఉన్న ఊర్ల సంగతేంది,ప్రజల సంగతేందని ఆలోచన చేయాలి కదా! ప్రభుత్వం అంటే వాల్ల ముడ్డి కిందికి తోడుకోవడానికి, తనకే పేరు రావాలని జనాన్ని ముంచితే మంచిది కాదు గదా ?అగో ఎమ్మెల్యేలు,మన సర్కారు నౌకరిగాళ్లు కూర్చుండే బంగ్లాలను కూలగొట్టి కొత్తది గట్టిండ్లట.ఏమిటికచ్చింది పాయిదా,కనీసం మన దగ్గర వసూళ్లు చేసిన పన్నులను కాపాయంగా ఖర్చు పెట్టి ప్రజలకు మేలు చేయాలి.కదా ? రాజుల పైసలు రాళ్ల పాలన్నట్లు ప్రజల పైసలను పరుల పాళ్లు చేస్తున్నాడు.ఇంకొకరి మాట వినడoట,తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లని నాలుగు లక్షల కోట్ల అప్పు చేసిండట.
బస్సు సముద్రాల పొలమారులకు ప్రవేశించింది.వాతావరణం చల్లగా, మబ్బులతో ఉన్నది.మూడు రోజులు తుపాన్ వర్షాలు కురుస్తాయని వార్తలు రావడంతో రైతులు ఆందోళన పడుచున్నారు.రోడ్డు పక్కపొంటి వరి కోతలు కోసిన వడ్లను పొలాల్లోనే ప్లాస్టిక్ పరుదలు పరిచి వడ్లు ఆరబోసినారు.ఒక్కసారిగా తెప్ప చినుకులు రానే వచ్చినవి.ఎండబోసిన వడ్లు తడువకుండా రైతులు ఇంటిల్లిపాదితో కలిసి సిద్ధంగా ఉంచుకున్న పరదలను కప్పుచున్నారు.మరల మా ముందు సీటులో కూర్చున్న మహిళలు ముచ్చట సాగించారు. అయ్యో ?పాపం! వాన సల్లగుండ. వారం రోజులు ఆగితే వడ్లు చేతికి వచ్చు.మనం ఇంత కట్టపడి పంట పండిస్తే అమ్మబోతే అడివి శాత్రమే కాబట్టే, మొన్న మీ మరిది 40 బస్తాల వడ్లు ఏసుకపోతే బస్తాకు 3 కిలోలు తరుగు కింద తీసిండట,ఏమున్నది అక్కా! ఆరు నెల్లు
  కష్టపడి పండించిన వడ్లను గళ్లలోలే ఎండబోసి సరిగా కాంట పెట్టి మిల్లు కాడికి తీసుకపోతే తీరా మిల్లోడు క్వింటాలు ఇరవై కిలోల వడ్లు కొరిగి పాడుచేసే.వడ్లు అమ్మకుంటా వాపసు తెస్తామంటే ట్రాక్టర్ కిరాయి మీద పడే.గిన్నీ కష్టాలతో ఎదురు ఈదుతున్న రైతులను పట్టించుకునే సర్కారే లేకపాయే.
       పోయే బస్సల్ల ఒక్కసారి ఆగింది. ఎందని పక్కపొంటి చూస్తే పాత రోడ్డు కల్వర్టు జెసిపి డ్రిల్లర్ తో కూలగొడుతున్నారు.అందులోని ఐరన్ రాడ్లను ముక్కలు చేసి పాత రోడ్డు మీద వేయంగ జారీ బస్సు పోయే రోడ్డు మీద పడ్డవి.రాడ్ మీద పేర్చిన ఐరన్ ముక్కలను చూసిన మహిళలు మరల మాటలు సాగించారు. వీళ్ల కడుపు సల్లగుండ ఏ జమాన మోరీ కట్టినారో గాని మిషిన్ తోని కూలగొట్టిన కూలుతలేదు.
తీసిన ఇనుప రాడ్లు కూడా గిన్నేoడ్లయిన గింత ఖరాబు కాలేదు.ఇప్పుడే షాపుల కొన్నట్లు ఉన్నయి. ఆమె మాటలకు జవాబుగా పక్కపొంటి కూర్చున్న మహిళా మాట కలిపింది.లోక మేలు తలిచటోడు కొంతయిన మంచి చేస్తాడు.వాని మేలు చూసుకునేటో డు మూడో చేత కూడా దోచుకుంటాడు.తెలంగాణ వచ్చినంక మూడేండ్ల కింద కట్టిన కాళేశ్వరం,మేడిగడ్డ
పిల్లర్స్ కుంగి,బుంగలు పడ్డాయంట.లక్ష కోట్లు పెట్టి కడితే ఏమి పాయిదా వచ్చింది.వాడు చారణాకు ఆశ పడితే జనం సొమ్ము లక్ష కోట్లు నీటి పాళాయెనా?అంటూ చదువుకున్నోళ్ల తీరుగా చెప్పింది.        ఇంతలో పందిల్ల స్టేజీ వచ్చి బస్సు ఆగింది.నలుగురు దిగితే ఆరుగురు బస్సెక్కారు. అందులో ఒక కురు వృద్ధుడిని చూసి నా పక్కపొంటి కూర్చున్న యువకుడు లేచి తాత కూర్చొమని సీటు ఇచ్చాడు. బస్సు ఎల్లమ్మ చెరువు మత్తడి వాగు రొడ్డాo దాటింది.నా పక్కపొంటి కూర్చున్న తాతను మందలించాను.మీ ఊళ్లే ఎలక్షన్ల లొల్లి ఎట్లుందని
అడిగాను.నేను మెల్లగా అడుగుతే తాత గట్టిగనే సమాధానం చెప్పిండు.చాన మందికి ఆయనంటేనే ఇసుకత్తంది.పాల కుండకు సెకనిచ్చే కుంపటి లెక్కన మండుతున్నారు.ఈసారి కొత్త ప్రభుత్వం రావాలనే అంటున్నారు.కాని ఎవరు బయటపడుత లేరు.ఎక్కువ మంది మదిలో మాత్రం ప్రభుత్వం మారాలని ఉన్నదని నిర్మొహమాటంగా చెప్పితే నాకు ముసలాయన తెగింపు ముచ్చటేసింది.
                         రాష్ట్ర ఏర్పాటు కావాలని పోలీసు కాల్పుల్లో విద్యార్థులు మరణించిన సంఘటనలు ప్రపంచంలో అరుదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై  తొలిదశ ఉద్యమమును అణచివేసినప్పటికి 1999 న
మలిదశ ఉద్యమం ప్రారంభమైనది. ప్రజలందరూ స్వంత ఖర్చులు భరిస్తూ బహిరంగ సభలలో, ఊరేగింపులలో,ధర్నాలలో, సడక్ బంద్ లో,మిలియన్ మార్చ్ లో, సాగర హారం,రైల్ రోకో లాంటి ఉద్యమాల్లో మెజారిటీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.రబ్బర్ బులెట్ కాల్పులకు, చిత్ర హింసలకు గురైనగాని విద్యార్థులు వెనుతిరుగకుండా తెగించి పోరాడినారు.సింగరేణి, ఆర్టీసీ,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,కార్మికులు సకల జనుల సమ్మెలు చేశారు. దాదాపు మూడు వందల మంది యువకులు  ఆత్మబలిదానాలు చేసుకున్నారు.అనేక త్యాగాల నిర్మాణంతో ఏర్పాటైన తెలంగాణలో మంచి పాలకులు రాలేదన్న బెంగతో ప్రజాస్వామ్య వాదులు ఆందోళనలకు గురయ్యారు.కాని సిద్దిపేట, హుస్నాబాద్, హన్మకొండ పల్లెవెలుగు బస్సు ప్రయాణంతో నాకైతే ఆశ కలిగింది.2023 నవంబర్ 30న జరుగబోయే శాసనసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు మార్పు జరగాలని, కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు.
కృతజ్ఞతలతో,
దీనితో జతగా నా/మేరుగు రాజయ్య పోటో.
                                   మీ భవదీయుడు,
                                మేరుగు రాజయ్య
                  సెల్ నంబర్ — 9441440791.