తెలంగాణ అంశంపై రాష్ట్రపతి-ప్రధాని భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ అంశం త్వరలో తేలనుంది. ఈమేరకు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమైనట్టు సమాచారం. దీంతో కేంద్ర త్వరలో తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.