తెలంగాణ కవాతుకు మద్దతుగా ర్యాలీ

హాన్మకొండ: తెలంగాణ కవాతుకు మద్దతుగా వరంగల్‌ జిల్లా హాన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.  వెయ్యి స్తంభాల గుడి నుంచి అమరవీరుల స్తూపం వరకు తెలంగాణ ప్రొటెక్షన్‌ ఫోరం ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో తెలంగాణవాదులు పాల్గొన్నారు.