తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు నిర్ణయం పై హర్షం

జహిరాబాద్ సెప్టెంబర్ 15( జనం సాక్షి): తెలంగాణ కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పై టి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నామా రవికిరణ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు అని తెలిపారు.మిస్టర్ బండి తెలంగాణ ప్రభుత్వం సచివాలాయానికి డా.బి.ఆర్ అంబేద్కర్ పేరును ఖారారు చేస్తూ జి.ఓ విడుదలచేసింది అని
కేంద్రంతో ఒప్పించి పార్లమేంటుకు అంబేద్కర్ పేరు పెట్టించు అని అన్నారు.
థ్యాంక్స్ టు తెలంగాణ డైనమిక్ సి.ఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.