తెలంగాణ పై మరోసారి తెదేపా వైఖరి వెల్లడించాలి

వరంగల్‌:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెదేపా తిరిగి స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు.వరంగల్‌ జిల్లా రఘునాథపల్లిలో శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సభ్యులు సమావేశంలో ఆయన పాల్గోని మాట్టాడారు.గతంలో తెదేపా తెలంగాణ విషయంలో స్పష్టత ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల్లో అపొహలు నెలకొన్నాయని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి పార్టీ తన స్పష్టతను మరోసారి వివరించాలని శ్రీహరి కోరారు.