తెలంగాణ మెడికల్‌ సీట్ట కోసం మెడికల్‌ జేఏసీ ఆందోళన

హైదారాబాద్‌: తెలంగాణ మెడికల్‌ సీట్ల కోసం తెలంగాణ మెడికల్‌ జేఏసీ ఆందోళన బాట పట్టింది. మెడికల్‌ సీట్లు పెంచాలంటూ శుక్రవారం గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఒక రోజు దీక్ష చేపట్టింది. ఈ దీక్షను తెలంగాణ రాజకీయ జేఏసీ కోదండరాం ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెంచాలని, నిజామాబాద్‌లో కొత్తగా మెడికల్‌ కాలేజి ప్రారంభించాలని, హల్త్‌ యూనివర్సిటీని హైదరాబాద్‌కు తరలించాలనినే డిమాండ్‌లతో మెడికల్‌ జేఏసీ ఈ నిరాహార దీక్ష చేపట్టారు.