*తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పధకాలు దేశానికి ఆదర్శం*

*57 ఏళ్ళు నిండిన వృద్దులకు ఆసరా పింఛన్ పధకం*

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)
                                            ప్రజా సంక్షేమమే తెరాస ప్రభుత్వ ధ్యేయమని *హుజూర్నగర్  స్థానిక శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి అన్నారు గురువారం మేళ్లచెరువు మండల కేంద్రంలోని  గ్రామ పంచాయతీ ఆవరణలో లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 57 ఏళ్ళు నిండిన వృద్దుల నూతన వృధ్యాప్య ఆసరా పింఛన్ పధకం ద్వారా మంజూరైన పింఛన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ వచ్చాక ఆసరా పింఛన్లు, నిరంతర ఉచిత కరెంట్ ఆడపిల్లల పెళ్ళికి ఆర్ధిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీ.అర్.యస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఏ రాష్టంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది అని పేర్కొన్నారు.