తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా సహాయ కార్యదర్శి గా మల్కాపురం సంగమేశ్వర్

జహీరాబాద్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి:) తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా సహాయ కార్యదర్శి గా ఝరాసంగం మండల పరిధిలోని ఈ దుల పల్లి గ్రామానికి చెందిన మల్కాపురం సంగమేశ్వర్ నియమిస్తున్నట్టు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య ఈమెయిల్ ద్వారా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్కాపురం సంగమేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా సహాయ కార్యదర్శి గా నియమించినందుకు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకులు మేకల సమ్మయ్య అధ్యక్షులు సుతారి రమేష్,ప్రధాన కార్యదర్శి పి లలిత, జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు కు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి జిల్లా సహాయ కార్యదర్శి గా నియమించి నందుకు వారి నమ్మకాన్ని నిలబెడుతూ జిల్లాలోని వికలాంగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రయోజనాన్ని జిల్లాలోని ప్రతి వికలాంగునికి అందేలా చూస్తానని తెలిపారు.