త్రిపుర గవర్నర్గా కేసరినాథ్ త్రిపాఠి
న్యూఢిల్లీ, జూన్7(జనం సాక్షి) : పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేషరినాథ్ త్రిపాఠికి అదనపు బాధ్యతలు అప్పగించారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. త్రిపుర ప్రస్తుత గవర్నర్ తతగట రాయ్ సెలవుపై ఉన్నారు. ఎటువంటి కారణాలు తెలపకుండానే ఆయన సెలవుపై వెళ్లారు. దీంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ త్రిపుర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.