-త్వరలో కాంగ్రెస్ పార్టీ లోకి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి? -బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ.

చిట్యాల( జనంసాక్షి )చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు , జడల్ పేట సర్పంచ్ కామిడి రత్నాకర్ రెడ్డీ బీఆర్ఎస్ పార్టీని వీడి త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ జిల్లా,మండల అధ్యక్షులకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా పత్రాన్ని అందజేసినట్లు సర్పంచ్ కామిడీ రత్నాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. గత 30 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకులు కామిడి రత్నాకర్ రెడ్డి రాజీనామాతో మరికొంతమంది సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నీ వీడనున్నట్లు రాజకీయ నాయకుల్లో చర్చలు జోరందుకున్నాయి.