త్వరలో రూ.500 నోట్లు

పెద్దనోట్ల రద్దుతో ఇప్పటిదాకా రూ.2వేల నోట్లనే బ్యాంకుల నుంచి తీసుకున్న ఏపీ, తెలంగాణ ప్రజలు 500-story_647_111316080510ఇవాళ కొత్త రూ.500 నోట్లను డ్రా చేసుకోనున్నారు. ఢిల్లీ, ముంబై, భోపాల్‌లో నిన్న కొత్త రూ.500 నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిని నేటి నుంచి బ్యాంకుల్లో పంపిణీ చేయనున్నారు. రూ.500 అందుబాటులోకి వచ్చాక ప్రజల నోట్ల కష్టాలు మరికాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.2వేల నోట్లను దుకాణాల్లో ఇచ్చినా చిల్లర చెల్లించలేక ఆ నోట్లను ఎవరూ తీసుకోవడం లేదు. రూ.500 అందుబాటులోకి వస్తే లావాదేవీలు మరింత సరళతరం అవనుంది.