థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం


17 మంది బాలికలు సజీవదహనం
బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది బాలికలు సజీవదహనమయ్యారు.వీంగ్‌పపావ్‌ జిల్లాలోని పిటాకియార్ట్‌ విటాయా పాఠశాలలోని బోర్డింగ్‌ హౌస్‌లో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది బాలికలు మృతిచెందగా… ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు అదృశ్యమయ్యారు. చనిపోయినవారంతా 5-12 లోపు వయసు వారేనని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బోర్డింగ్‌ హౌస్‌లో 38 మంది బాలికలు ఉన్నారు. వారంతా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చారని అధికారులు తెలిపారు.