దంతాలపల్లిలో రాస్తారోకో

దంతాలపల్లి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ నరసింహులపేట మండలం దంతాలపల్లిలో ఐకాస. తెరాస టీఆర్‌ ఎస్వీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈనెల 25న సూర్యాపేటలో జరిగే తెలంగాణ సమర భేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.