దంతాళపల్లిలో ఈ నెల 11,12తేదిల్లో స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు

నర్శింహులపేట :మండలంలోని దంతాళపల్లిలో ఈ నెల 11,12వ తేదిల్లో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి ఉపాధ్యాయుల స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఈవో ఎం.బుచ్చయ్య తెలిపారు. 11న తెలుగు పండితులకు, 12న హిందీ పండితులకు సమావేశాలుంటాయని ఈ సమావేశాలకు నరసింహులపేట. మరిపెడ, డోర్నకల్‌ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు హాజరు కావాలని తెలిపారు.