దక్షిణ కొరియా అధ్యక్షుడికి రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం
న్యూఢిల్లీ,జూలై10:(జనం సాక్షి ): భారత పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్- జె- ఇన్ కు రాష్ట్రపతి భవన్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో కలిసి ఆయన త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బల పడేందుకు తన పర్యటన ఎంతగానో సహకరిస్తుందని, భారత్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మూన్. ప్రధాని నరేంద్ర మోడీతో పాటూ పలువురు కేంద్ర మంత్రులు కూడా దక్షిణ కొరియా అధ్యక్షుడికి స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా రాజ్ ఘాట్ కు వెళ్లిన మూన్? అక్కడ మహాత్ముడి సమాధి వద్ద నివాళులు అర్పించారు.