దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్,మున్సిపల్ కౌన్సిలర్లు,తెరాస నేతలు

కొత్తకోట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య  సతీమణి కే.చంద్రకళ జ్ఞాపకార్థ కూడిక (దశదిన) కార్యక్రమం చర్చి వద్ద జరగగా మున్సిపల్ చైర్మన్ పొగాకు  సుఖేషిని విశ్వేశ్వర్, ఆ వార్డు కౌన్సిలర్ పద్మ అయ్యన్న,ఉమ్మడి జిల్లాల తెరాస అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్,మున్సిపల్ మేనేజర్ రవీందర్ పాల్గొని చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో,ఖాజ మైనోద్దిన్, రామ్మోహన్ రెడ్డి,ఎరుకలి తిరుపతయ్య,చింతలపల్లి సంధ్యా రవీందర్ రెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు వసీం ఖాన్,మాజీ వార్డు సభ్యులు సుభాష్,తెరాస పట్టణ ప్రధాన కార్యదర్శి వికాస్,తెరాస నాయకులు హోటల్ అంజీ,మాధవ రెడ్డి,మహేష్,బ్యాంకు శ్రీకాంత్, చింటూ తదితరులు పాల్గొని మృతి చెందిన కే చంద్రకళ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళి అర్పించారు. అనంతరం మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్యను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.