దామ గోవిందప్ప పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

మల్దకల్ ఆగస్టు 20 (జనంసాక్షి) మండల కేంద్రంలోని 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు దామ గోవిందప్ప మెమోరియల్ పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎస్ఐ ఈశ్వరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి పై స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు.విద్యార్థులుఈ దేశానికి గొప్ప పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. చిన్నారులకు శ్రీకృష్ణుని వేషాధారణతో అలంకరణ చేసి ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అనంతరం పాఠశాల నిర్వాహకులుఏఎస్ఐ ఈశ్వరయ్యను శాలువా పూలమాలలతో సత్కరించారు.తెలంగాణ రాష్ట్ర దేవాలయ కార్యనిర్వాహణ అధికారుల రాష్ట్ర అధ్యక్షుడు పురేందర్ కుమారును పాఠశాల నిర్వహకులు ప్రిన్సిపాల్ అంబికా ప్రేమ్ రాజ్ శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మిత్ర బృందం నరసింహారెడ్డి,దామ లక్ష్మీనారాయణ,వెంకటేశ్వర రెడ్డి, పెద్దదొడ్డి రాముడు తదితరులు పాల్గొన్నారు.