దిల్లీ విమానాశ్రయంలో రెండున్నర కేజీల బంగారం పట్టివేత

హైదరాబాద్‌: దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2.6 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.64.87లక్షలు ఉంటుందని తెలిపారు. బ్యాంకాక్‌ నుంచి దిల్లీకి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగులో ఈ బంగారం లభ్యమైనట్లు పేర్కొన్నారు. దాన్ని స్వాధీనం చేసుకుని ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.