“దివ్యాంగుల దినోత్సవం” సందర్భంగా త్రిచక్ర వాహనం బహుకరించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళాశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోపాల్ పేటకు, చెందిన డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి జి.పవన్ కుమార్ కు సింగిరెడ్డి “ఛారిటబుల్ ట్రస్ట్ “తరపున త్రిచక్ర వాహనాన్ని శనివారం అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, చంద్రమోహన్ రెడ్డి, కృపానందం గౌడ్, బుచ్చిబాబు రాఘవేందర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.