దుండగుల దాడిలో ఏఐఏడీఎంకే కోశాధికారి మృతి

తిరునల్వేలీ: కొందరు గుర్తు తెలియని దుండగులు చేసిన దాడిలో ఏఐఏడీఎంకే పార్టీ కోశాధికారి మృతి చెందాడు. తమిళనాడులోని కొంగరాయకురిచి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ప్రతినిధి పిచయిప్ప అనే వ్యక్తిపై దాడికి పాల్పడగా అతను అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో ఏఐఏడీఎంకే పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు.