దూసుకొస్తున్న ‘దానా’ 

 – బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం
* బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ‘దానా’ ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను భారత వాతావరణశాఖ అప్రమత్తం చేసింది.
* బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది.
* బుధవారం ఉదయానికి తుపానుగా, గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందొచ్చని ఐఎండీ పేర్కొంది.
* గురువారం అర్ధరాత్రినుంచి శుక్రవారం ఉదయంలోగా పూరీ (ఒడిశా), సాగర్ ద్వీపం (పశ్చిమబెంగాల్) మధ్యలో తీరం దాటొచ్చని భావిస్తోంది.
 ఉత్తరాంధ్రకు వర్ష సూచన: ‘
* తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండకపో వచ్చు. ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమబెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చు.
* విజయనగరం, పార్వ తీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
* దీనిపై బుధవారంనాటికి స్పష్టత వస్తుంది’ అని ఐఎండీ మాజీ డీజీ డా. కేజే రమేష్ తెలిపారు.
* బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి.
* వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
* ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలి కపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతా వరణ కేంద్రం తెలిపింది.

తాజావార్తలు