దేశవ్యాప్తంగా భద్రత పెంపు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు  చేసిన నేపథ్యంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కర్ఫ్యూ విధించారు. దేశరాజధాని ఢిల్లీలో భద్రతను పెంచారు. హైదరాబాద్‌, బెంగళూరులలో పోలీసు యంత్రాంగం అప్పమత్తమైంది.