దేశ భద్రత విషయంలో రాజీపడం

దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టంచేశారు. వేర్పాటువాది ముస్రత్ ఆలం విడుదలపై లోక్‌సభలో ప్రకటన చేసిన ఆయన.. ఆలం విడుదలపై జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ముస్రత్ ఆలంపై 27 క్రిమినల్ కేసులున్నాయని.. ఐతే 27 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించిందని హోంమంత్రి తెలిపారు. అటు ఆలం విడుదలపై జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాన్ని మరింత వివరణ కోరామన్న రాజ్‌నాథ్‌.. రాష్ట్ర ప్రభుత్వ క్లారిఫికేషన్ వచ్చాక అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.