దేశ రాజధానిలో షాకింగ్ యాక్సిడెంట్

61477548782_625x300న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. నైరుతి ఢిల్లీలోని జాఫర్పూర్ కాలాన్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. కారు ఢీకొట్టడంతో బైకుపై వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడిపోయాడు. మరోవైపు నుంచి దూసుకొచ్చిన లారీ కిందపడిన వ్యక్తిని బైకుతో సహా కొంత దూరం ఈడ్చుకుపోయింది. తీవ్రగాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న మనీశ్ గా గుర్తించారు. కారు, లారీ డ్రైవర్లు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. కారు నడిపిన వ్యక్తి మైనర్ అయివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీసీపీ(నైరుతి) సురేందర్ కుమార్ తెలిపారు.