దేశ వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

636077039771005144_thumbదేశ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ, మధుర, మొరాదాబాద్, ముంబైల్లో రాత్రి నుంచే జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటున్నారు భక్తులు. ఇస్కాన్ టెంపుల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రంతా భజనలతో పాటూ, ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు.

హైదరాబాద్‌: జంట నగరాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఇస్కాన్‌ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు, హారతి, భజన, తులసి పూజ, పుష్పార్చన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యుద్దీపాలు, వివిద రకాల పుష్ఫాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. నగరంలో పలు కృష్ణాలయాల్లోనూ సందడి నెలకొంది. ఉదయం నుంచి ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.